ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ ములుగు జిల్లా నూతన ఎస్పీ గౌస్ ఆలం కి స్వాగతం పలికారు. ములుగు జిల్లా నూతన ఎస్పీగా శ్రీ గౌస్ ఆలం, ఓఎస్డి అశోక్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించిన జగదీష్ అభినందనలు తెలియజేశారు. జిల్లాలోని ఏటూరునాగారం డివిజన్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ)గా గతంలో పని చేసిన 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌస్ ఆలం నేడు ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ గౌస్ ఆలం ఏటూరునాగారం ఓఎస్డి గా విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. నూతనంగా ములుగు ఎస్పీగా రావడం సంతోషకరమన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తున్న సమస్త ములుగు జిల్లా పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజ పరిరక్షణలో అత్యంత క్రియాశీలక పాత్ర పోలీసు శాఖదని అని అన్నారు. ప్రజారక్షణ ప్రధమ ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని ఆ విధంగా జిల్లాలోని మిగతా శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఏటూరునాగారం ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరికా విజయరామ్ నాయక్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కోకిల మహేష్ మల్లంపల్లి ఎంపీటీసీ ప్రభాకర్ ములుగు మండల యూత్ అధ్యక్షుడు బైకని సాగర్ చిప్ప అశోక్ కందగట్ల శ్రీను తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.