ఏఎస్ రావు నగర్ లోని శ్రీరాధక్రిష్ణ ఆలయంలో శ్రీకృష్ణా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోకులష్టమి వేడుకలలో భాగంగా ఉదయం నుంచి 8 గంటలకు దర్శన హారతి కార్యక్రమం, ఎనిమిది గంటల ముప్పైయి నిమిషాలకు భాగవత కధ ప్రవచానాలు పది గంటలకు సుదర్శన హరతి, మద్యాహ్నం రెండు గంటలకు హరినామ సంకీర్తనల భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
స్వామివారి తీర్ధ ప్రసాదాల వితరణ అనంతరం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్కాన్ ఆలయ పూజారులు వేదంత చైతన్య, పావన దోరంగదా, మాధవప్రభు, పవన్ దాస్, గోకుల్ రంజాన్ దాస్, ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈపూజా ఈకార్యక్రమంలో పూలపల్లి మాధవ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ రాము యాదవ్ లక్ష్మాన్ యాదవ్, క్రిష్ణయాదవ్, మాజీ కౌన్సిలర్ పూలపల్లి భవిత, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా