రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా నేడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో మంత్రిని ఆశీర్వాదించారు. అదే విధంగా విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలలో కూడా మంత్రి రోజా పాల్గొన్నారు.
విశాఖలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ రాజ శ్యామల అమ్మవారి శ్వేత సహస్ర యాగం / చతుర్వేద హవనం / శ్రీత శాస్త్ర ఆగమ సభలు లో శనివారం నాడు మంత్రి రోజా పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొని విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు.