30.2 C
Hyderabad
May 17, 2024 15: 12 PM
Slider విజయనగరం

రామతీర్థ ప్రాజెక్టును వేగంగా నిర్మించాలని సీఎం ను కోరిన కోలగట్ల

#kolagatla

పార్టీ కార్యక్రమాలు ప్రజలకు  మరింత చేరువ చేస్తూ, గడపగడపకు కార్యక్రమాన్ని  విజయనగరం జిల్లాలో  విజయవంతం చేయాలని ఏపీ సీఎం జగన్… విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తో  అన్నారు. ఈ మేరకు ఈ సాయంత్రం విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, అల్లుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్ తో  కలిసి సీఎం జగన్ ను తాడేపల్లి లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటీ స్పీకర్ గా నియామకం చేసినందుకు సీఎం జగన్ కి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్  వీరి తో మాట్లాడుతూ  పార్టీని మరింత  పటిష్ట పరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గడపగడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పని చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల నగరంలో మౌలిక వసతులు ఏర్పాటు విషయమై సీఎం జగన్ తో చర్చించారు. చెరువులు, పార్కుల అభివృద్ధి తో పాటు  మహిళల కోసం ప్రత్యేకంగా మహిళ పార్కును కూడా ఏర్పాటు  చేస్తున్నట్టు  ఎమ్మెల్యే కోలగట్ల సీఎం జగన్ కి  తెలిపారు. ప్రజల మౌలిక వసతులకు సంబంధించి నిధుల విషయమై ఎమ్మెల్యే కోలగట్ల సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లా లో  రామతీర్థ తీర్థ సాగర్ ప్రాజెక్ట్  త్వరిత గతిన  పూర్తి అయ్యే విధంగా చూడాలని,    నగర ప్రజలకు  మరింత   మంచినీరు  సరఫరా అయ్యే విధంగా చూడాలని  ఎమ్మెల్యే కోలగట్ల సీఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.ఈ సందర్భంగా విజయనగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నీ  అభినందిస్తూ  ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ముఖ్యమంత్రి అభినందించారు.

ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.  పార్టీ లో అన్ని విభాగాలను  పటిష్టవంతం చేయాలని, అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ,  సీఎం జగన్…ఎమ్మెల్యే అల్లుడైన ఈశ్వర్ కౌశిక్ తో  అన్నారు.

Related posts

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

డీకే అరుణ, రామచందర్‌రావు గృహనిర్భంధం

Satyam NEWS

అక్షరాభ్యాసానికి వెళుతూ ఆసుపత్రి పాలైన పిల్లలు

Satyam NEWS

Leave a Comment