ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామ పరిధి గుంటూరుపల్లికి చెందిన మారపెల్లి రామకృష్ణ ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు. అదే విధంగా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన మోలుగురి మహేందర్ కూడా ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న తస్లీమా మంగళవారం వెళ్ళి బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అదే విధంగా సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సాయం అందించారు. వారి మరణం బాధాకరమని, మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరు కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు,తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు ఉన్నారు.