తెలంగాణ ప్రజల పరిపాలన భవనమైన ప్రగతి భవన్ ను నక్సలైట్లు కూల్చి వేయాలని బహిరంగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ములుగు మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహాదారిపై బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ పిలుపు మేరకు ములుగు జిల్లాలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన ఆయన దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ పాదయాత్ర ఎవ్వరైన చేసుకోవచ్చని అసత్యపు మాటలతో చౌకబారు విమర్శలు చేస్తే, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి, జడ్పీటిసిలు గండ్రకోట శ్రీదేవి, సకినాల భవాని, రైతు బందు అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, , పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ , వివిధ మండలాల బిఆర్ఎస్ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, పిఏసిఎస్ చైర్మన్ లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.