తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ఉప్పల్ బస్ డిపోలో కార్గో పార్సెల్ మరియు కొరియర్ సర్వీస్” సేవలను తెలంగాణ లోని ఇతర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు 24 గంటల్లో డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కార్గో పార్సిల్ కొరియర్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డివిఎం జగన్ డి.ఎం వెంకటేష్, టి ఎస్ ఆర్ టి సి బస్ డిపో అధికారులు సిబ్బంది, మరియు టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .