28.2 C
Hyderabad
May 17, 2024 12: 03 PM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే విడదల రజని పాలన లో లంచగొండి తనం పై గళమెత్తిన వైసిపి నేత

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిలర్ మానుకొండ మాధవి రెడ్డి చిలకలూరిపేట అధికార పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్. ఆమె వార్డు ప్రజల కోసం నేడు మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

కౌన్సిల్ హాల్ ఎదుట వార్డు ప్రజలతో కలసి బైఠాయించి vro 4 వేలు లంచం తీసుకున్నారని, మంచినీటి ట్యాంకులు అమ్ముకుంటోన్న విషయం గురించి ప్రశ్నించారు. స్వంత పార్టీ కౌన్సిలర్ ప్రశ్నలు సంధించారు. దీనిపై ఎమ్మెల్యే విడదల రజని స్పందించాలి అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

అవినీతి వేళ్ళూనుకు పోయిన చిలకలూరిపేట నియోజకవర్గ పాలనకు ఎమ్మెల్యే విడదల రజని బాధ్యత వహించాలని అన్నారు. ధైర్యం గా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వైస్సార్సీపీ కౌన్సిలర్ మానుకొండ మాధవి రెడ్డి ని రావుసుబ్రహ్మణ్యం అభినందించారు.

Related posts

కరోనా వ్యాప్తి ఆపేందుకు మనం ఇళ్లలోనే ఉందాం

Satyam NEWS

ఏపీ బీజేపీ: ఇది రెండు నాలుకల పార్టీ

Satyam NEWS

ఉద్యోగమేమో ఫుల్ టైం జీతం మాత్రం పార్ట్ టైం

Satyam NEWS

Leave a Comment