గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిలర్ మానుకొండ మాధవి రెడ్డి చిలకలూరిపేట అధికార పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్. ఆమె వార్డు ప్రజల కోసం నేడు మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కౌన్సిల్ హాల్ ఎదుట వార్డు ప్రజలతో కలసి బైఠాయించి vro 4 వేలు లంచం తీసుకున్నారని, మంచినీటి ట్యాంకులు అమ్ముకుంటోన్న విషయం గురించి ప్రశ్నించారు. స్వంత పార్టీ కౌన్సిలర్ ప్రశ్నలు సంధించారు. దీనిపై ఎమ్మెల్యే విడదల రజని స్పందించాలి అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
అవినీతి వేళ్ళూనుకు పోయిన చిలకలూరిపేట నియోజకవర్గ పాలనకు ఎమ్మెల్యే విడదల రజని బాధ్యత వహించాలని అన్నారు. ధైర్యం గా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వైస్సార్సీపీ కౌన్సిలర్ మానుకొండ మాధవి రెడ్డి ని రావుసుబ్రహ్మణ్యం అభినందించారు.