డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి బ్రాందీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి సుమారు రూ.2 లక్షల 17వేలు నగదు చోరి అయినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. వివరాలు ప్రకారం శుక్రవారం అమ్మకాలు జరిగిన సొమ్మును బ్రాందీ షాపులో పనిచేసే ఉద్యోగులు ఇనుప పెట్టిలో భద్రపరిచి రాత్రికి ఇంటికి వచ్చేసారని, అయితే బ్రాందీ షాప్ కు ఇద్దరు వ్యక్తులను కాపలాదారులు (నైట్ వాచ్మెన్) విధులు నిర్వహిస్తున్నారని, చోరీ రాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాగా శనివారం ఉదయం బ్రాందీ షాప్ ఉద్యోగులు నగదు చోరీ జరిగినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి కాకినాడ నేర పరిశోధన సంస్థ (క్లూస్ టీం) చేరుకుని చోరి జరిగిన సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. అలాగే రాజమహేంద్రవరం ఆర్వోఎంవో ఎక్సైజ్ ఎస్సై జి వెంకటేశ్వరరావు షాప్ లో ఉన్న స్టాక్ మొత్తాన్ని నమోదు చేశారు. చోరి జరిగిన ప్రదేశాన్ని ఆలమూరు ఎస్సై శివ ప్రసాద్ తో పాటు కానిస్టేబుల్ కేవివి రవికుమార్ క్షుణ్ణంగా పరిశీలించారు.
previous post
next post