27.7 C
Hyderabad
May 7, 2024 07: 22 AM
Slider ముఖ్యంశాలు

ప్రధాని మోడీ పర్యటన లో మా ర్పు….!

#ministerbotsa

సమాచార శాఖ మెసేజ్ తో అలెర్ట్…అనంతరం మంత్రి బొత్స మాటలతో తుస్సు…!

ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని మోడీ ఏపీ రాష్ట్రం జిల్లా విశాఖ కు వస్తున్న సంగతి తెలిసిందే. పీఎం మినిట్ టూ మినిట్ కార్యక్రమంపై కేంద్రం కసరత్తు చేస్తున్నది కూడా. అయితే విశాఖ ప్రధాని పర్యటన లో విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కూడా ఉంటుందని పలు పత్రికలలో వార్తలు రావడం… దానిపై అకస్మాత్తుగా మంత్రి బొత్స జిల్లా కు వచ్చి.. కలెక్టర్ తో సమీక్ష జరపడం..అనంతరం మీడియాతో మాట్లాడతారని సమాచారాన్ని సమాచార శాఖకు చెప్పింది.

సరైన సమయానికి విలేకరులంతా కలెక్టరేట్ కు చేరుకున్నారు.. కూడా. దాదాపు మూడు గంటలనై..మంత్రి బొత్స రాకపోవడంతో మీడియా లో కాస్త అసహనం కలిగింది. రెండు రోజుల పాట పీఎం మోడీ టూర్ లో భోగాపురం ఎయిర్ పోర్టు కార్యక్రమం ఉంటుందా ఉండదా…అన్న సందిగ్ధతలో ఉన్న సమయంలో “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి.. సమాచార శాఖ ఏడీని సంప్రదించారు…దాంతో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రోగ్రాం పీఎం మోడీ తో ఉండకపోవచ్చని సూచాయిగా చెప్పారు. ఆ తర్వాత మంత్రి బొత్స కలెక్టరేట్ బయట మీడియా తో మాట్లాడారు… భోగాపురం ఎయిర్ పోర్టు పనులు భూ సేకరణ.. నష్ట పరిహారం పై చర్చించామని..ఈ పర్యటన లో పీఎం ఓపెనింగ్ ఉండదని చెప్పారు. ఆ తర్వాత కారు ఎక్కిన సమయంలో ‘సత్యం న్యూస్. నెట్’ ప్రతినిధి అదే విషయాన్ని మరల ప్రస్తావించగా…ప్రస్తుతం విశాఖ పీఎం మోడీ పర్యటన లో భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమం లేదని తర్వాత ఉంటుందని చెప్పారు.

Related posts

రేషన్ కార్డులు తొలగింపు నిజం కాదు

Satyam NEWS

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

Bhavani

సీఐ పై విచారణకు ఆదేశాలు

Bhavani

Leave a Comment