భారతీయ కుటుంబ వ్యవస్థలో శ్రీరా ముడు అంతర్భాగమని, నరుడిగా జన్మించి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడని ఆదర్శ కథానాయకుడు శ్రీరామచంద్రుడని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కాసా జయప్రద అన్నారు. స్థానిక దానవా యిపేటలోని ప్రణవకుటిలో డాక్టర్(మేజరు) చల్లా సత్యవాణి రచించిన ‘ప్రత్యక్ష ఆలయ దర్శిని- శ్రీ సీతారామాంజనేయ దేవాలయాలు పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
డాక్టర్ చల్లా సరస్వతి నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆమె సోదరి డా. సత్యవాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రద పుస్తక సమీక్ష సమీక్ష చేస్తూ, డా. సత్యవాణి ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమన్నారు. గౌరవ అధ్యక్షుడిగా పాల్గొన్న మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ రామాయణ ఫలశ్రుతిలో ఈ గ్రంథ పారాయణ వల్ల కుటుంబ ధనధాన్యాభివృద్ధి కలుగుతుందని ఉందన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సాహితీ వేత్త వారణాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశంలోని ప్రసిద్ది చెందిన ఆలయాలతో పాటు మారుమూల గ్రామాలలో ఉన్న ఆలయాల గురించి కూడా రచయిత్రి వివరించడం అభినందనీయమన్నారు. చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థపాక కార్యదర్శి పెరుమాళ్ల రఘనాథ్ సంచాలకత్వం వహించగా రాజమహేంద్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ టీకె విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. సహస్ర పున్నముల దర్శనం చేసుకున్న తాడేపల్లి భానుమతిని సత్కరించారు.
అలాగే స్నేహానికి స్వర్ణోత్సవం పేరిట కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల పూర్వ అధ్యాపకులతో నిర్వహించనున్న పూర్వ అధ్యాపకుల సమ్మేళనానికి డా. చల్లా సత్యవాణి ఆహ్వానం పలికారు. విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారు. విశ్రాంత ఆచార్యులు ఎం.ఎన్. మూర్తి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డా. చల్లా హైమావతి అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొ. ఎ. వసుంధర సభా సంచాలక త్వం వహించారు. విశ్రాంత కామర్సు శాఖాధ్యక్షురాలు డా. (మేజరు) కళ్యాణి భగవతికి సత్కారం చేసారు. పూర్వ అధ్యాపకులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో పలువురికి సత్కారాలు చేసారు. జన గణ మన తో కార్యక్రమం పూర్తయింది.