అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరాఖండ్ రాజకీయాలు రసవత్తంగా మారాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటివైపు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల, రాష్ట్ర కేబినెట్ మంత్రి యశ్పాల్ ఆర్య అతని కుమారుడు ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటనిస్తుందని చెప్పొచ్చు. రావత్ ప్రభుత్వంలోని మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2016లో బీజేపీలో చేరిన ఉత్తరాఖండ్కు చెందిన తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి సొంత పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.