మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యమ్థాంగ్ హౌకిప్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఇద్దరు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ పార్టీ ఇంచార్జ్ సంబిత్ పాత్ర సమక్షంలో బీజీపీలో చేరారు. ఇమో సింగ్ కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచినప్పపటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.