వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల లలో టీడీపీ తరపున చిన్ని కుమారి లక్ష్మీ ని నిలబెడుతున్నట్లు…టీడీపీ నేత ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలియజేసారు. విజయనగరం అశోక్ బంగ్లా కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ పరంగా గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ అభ్యర్థి గా చిన్ని కుమారి లక్ష్మీ ని నిలబెడుతున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్క గ్రాడ్యుయేట్ తమ ఓటు ను నమోదు చేసుకోవాలని… అందుకోసమే తాను విజయనగరం వచ్చి నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి లో యువకులే ప్రభుత్వాన్ని గద్దె దించగలరని అదీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా అని అశోక్ బాబు స్పష్టం చేశారు.
previous post