ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించింది.. ఆ శాఖ. అయితే ఈ సారి కలెక్టర్ కు బదులు జేసీ హాజరయ్యారు. అలాగే ఈ ఏడాది ముఖ్య అతిధులు గా స్థానిక వైఎస్సార్సీపీ నేత విజయనగరం ఎమ్మెల్యే.. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తో పాటు జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు.
రాజకీయ కార్యక్రమాలు ఆలస్యం గా ప్రారంభం అవుతున్న… వాటికి ప్రజాప్రతినిధులు వస్తేనే మొదలు పెట్టేవారు. కానీ పోలీసు అమరవీరుల దినోత్సవంకు హాజరైన ఇద్దరు ప్రజాప్రతినిధులు నిర్దేశించిన సమయానికి కన్నా ముందు గానే పరేడ్ గ్రౌండ్ లో ఉన్న స్మృతి వనానికి చేరుకోవడం విశేషం.
అలాగే శాఖా సిబ్బంది నుంచీ డిప్యూటీ స్పీకర్ గౌరవ వందనం స్పీకరించే సమయంలో తన ఎడమ చేతిని జేబులో ఉంచుకుని సెల్యూట్ చేయడం కెమెరా కు చిక్కింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో గద్గద స్వరంతో కాస్త విషాదంగా చదవడం కనిపించింది. ఇక పరేడ్ కమాండెంట్ గా వ్యవహరించిన ఏఆర్ అడ్మిన్ చిరంజీవి… పరేడ్ లో ఉన్నంత సేపు కాస్త అలసటగా కనిపించారు.