ముత్యాల ముగ్గులు కళలకు నిలయాలు ముత్యాల ముగ్గులు కళలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లోనీ ప్రతిభను వెలికి తీస్తాయనీ హైదరాబాదు నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.
బుధవారం మకర సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చర్లపల్లి కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, బన్నాల గీత ప్రవీణ్, గొల్లూరి అంజయ్య, మేకల అనలా హనుమంతురెడ్డి, గంధం జోష్ణ నాగేశ్వరరావు లు పాల్గోని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ముత్యాల ముగ్గులు కళలలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లోనీ ప్రతిభను వెలికి తీస్తాయనీ అన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి మేకల మధుసూదన్ రెడ్డి గజ్జల సత్యరాజ్ గౌడ్, గ్యార ఉపేందర్ , కాయ హనుమంతు, జహంగీర్ గౌడ్ ,శివ, జాన్, అల్లాపాషా, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.