తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి జాతి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు. ఈ పిల్లులు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని గిరిజనులు విశ్వసిస్తారు.
భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం. అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు. దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తింటాయి. వీటి జీవితకాలం 12 నుండి 15 ఏళ్లు ఉంటుంది.