అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో రూ.6 లక్షల అంచనా విలువతో నిర్మించ తలపెట్టిన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి చేసుకున్న స్మశాన వాటిక ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో ని సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో స్మశాన వాటికలను త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రజలు సూచించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొలను సునీత వెంకటేశం, జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, సర్పంచ్ అంతటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.