ఫుడ్ పాయిజన్ కారణంగా ముంబై – అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో అనేకమంది ప్రయాణీకులుఅస్వస్థతకు గురయ్యారు. 40 మంది మహిళలు సహా అనేకమంది ప్రయాణీకులు అస్వస్థతకు గురి కావడంతో రైలును సూరత్ స్టేషన్లో నిలిపివేశారు. ఐదుగురు
మహిళలకు సూరత్ రైల్వే స్టేషన్లోనే చికిత్స అందించారు. ప్రయాణీకులకు పాడైపోయిన బ్రెడ్, బటర్ సర్వ్ చేశారని, వాటిని తినడం తో నే ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.