39.2 C
Hyderabad
May 3, 2024 11: 04 AM
Slider శ్రీకాకుళం

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఐదు రోజుల జిల్లా పర్యటన

#botsa

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 25వ తేదీ నుంచీ ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉంటూ పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 25 నుంచీ ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 30 వ తేదీ వరకు విజయనగరంతో పాటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యటించి పలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

26న ఉదయం 11 గంటలకు నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో నెల్లిమర్ల నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం చేరుకొని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 27న ఉదయం 8-30 గంటలకు శ్రీకాకుళం బయలుదేరి అక్కడ… సీఎం జగన్ అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం తన నివాసానికి చేరుకుంటారు. ఆ మర్నాడు 28న ఉదయం 11 గంటలకు సాలూరు లో నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇక 29వ తేదీన  ఉదయం 10 గంటలకు చీపురుపల్లి చేరుకొని నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పార్వతీపురం చేరుకొని పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

Related posts

నిజామాబాద్‌లో సెల్‌ టవర్‌ నుంచి మంటలు

Satyam NEWS

పేకాట స్థావరంపై దాడి భారీగా నగదు పట్టివేత

Satyam NEWS

ఘనంగా తెలంగాణా స్పీకర్ పోచారం జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment