రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 25వ తేదీ నుంచీ ఐదు రోజుల పాటు జిల్లాలోనే ఉంటూ పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 25 నుంచీ ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 30 వ తేదీ వరకు విజయనగరంతో పాటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యటించి పలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
26న ఉదయం 11 గంటలకు నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో నెల్లిమర్ల నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం చేరుకొని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 27న ఉదయం 8-30 గంటలకు శ్రీకాకుళం బయలుదేరి అక్కడ… సీఎం జగన్ అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం తన నివాసానికి చేరుకుంటారు. ఆ మర్నాడు 28న ఉదయం 11 గంటలకు సాలూరు లో నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇక 29వ తేదీన ఉదయం 10 గంటలకు చీపురుపల్లి చేరుకొని నియోజకవర్గం స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పార్వతీపురం చేరుకొని పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.