సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్య వైశ్య ప్రముఖుడు వంగవీటి బ్రహ్మం గుండెపోటుతో బుధవారం అకాల మరణం చెందారు.
కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి బ్రహ్మం పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఉంచి,పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ బ్రహ్మం లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం మా కుటుంబానికి,కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులును ఓదార్చి,కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటానని అన్నారు.
ఉత్తమ్ పద్మావతి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్