25.2 C
Hyderabad
May 16, 2024 19: 39 PM
Slider పశ్చిమగోదావరి

ఎంతో విలువైన స్థలం కారుచౌకగా లీజుకు….

#Zilla Parishad site

ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని అతి విలువైన భూమిని కారు చౌకగా లీజుకు ఇవ్వబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికారులు అలా చేయబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వెనుక 100 గజాల దక్షిణం పేస్ జిల్లా పరిషత్ స్థలం ఉంది.

అలాగే విగ్రహాల ఎదురుగా కొత్త బస్టాండ్ ప్రధాన రహదారి లో ఉన్న ప్రధాన గేటు ప్రక్కన తూర్పు వైపు దక్షిణం పేస్ లో 50 గజాలు మొత్తం 150 గజాల స్థలం ఉంది. ఈ మొత్తాన్ని కేవలం 1 లక్షా 70 వేల రూపాయల తక్కువ లీజుకే ఇచ్చేసినట్టు తెలిసింది. జిల్లా పరిషత్ కాంపౌండ్ లో 9 షాప్ లు ఉన్నాయి.

వాటిలో 6 షాపులకు ఒక్కొక్క షాపుకు 4 లక్షల రూపాయలు చొప్పున అడ్వాన్స్ లు తో పాటు ఒక్కొక్క షాపుకు నెలకు 50 వేలు లీజు వసూలు చేస్తున్నారు. మరో మూడు షాపులకు అడ్వాన్స్ గా రూ.4 లక్షలు, నెల అద్దె 20 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. అయితే ఎంతో విలువైన 150 గజాల స్థలానికి కేవలం 1లక్షా 70 వేలు లీజుగా కట్టించుకున్నట్టు జిల్లా పరిషత్ కార్యాలయం లో కొంత మంది ఉద్యోగులు గుస గుస లాడుకుంటున్నారు.

జిల్లా పరిషత్ కార్యాలయం లో 150 గజాల ను ఎక్విజిషన్ చేసి అందుకు సంబంధించిన ఫైల్ ను జిల్లా అధికారులకు పంపినట్టు తెలిసింది. ఉన్నతాధికారులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు.

Related posts

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

మాఫియా: ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

జైల్లో బాలకృష్ణ న్యూఇయర్​ సెలెబ్రేషన్స్

Satyam NEWS

Leave a Comment