ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం లో నెన్నెల మండలం లో ఖార్జీ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ట్రాక్టర్లు బెల్లంపల్లి కి వెళుతున్నాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని తేలడంతో పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన తరలించడం జరిగింది.
ఇలాంటి అక్రమ రవాణాను సహించేది లేదని చట్టపరమైన చర్యలు చేసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఇంకా కొన్ని గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా అవుతుందని వాటిని కూడా పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు.