డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలని మాలల చైతన్య సమితి డిమాండ్ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ముందు అమర ప్రసాదు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ముందు అమర ప్రసాదు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి దేవదాస్, తాలూకా అధ్యక్షులు అవుట ఎర్ర శ్రీనివాసులు మండల అధ్యక్షులు బి సురేందర్ నగర పంచాయతీ అధ్యక్షులు బాపనపల్లి సందీప్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కర్ణ శివయ్య, మధ్యల అంజి, జామ్ చిన్న కురుమయ్య
మధ్యలో కురుమయ్య, బిల్లా రామస్వామి రామచంద్ర నాగ శేషు రాము పాటూరి బాలరాజు మూలే నడిపి మొట్ట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాదు పై దేశద్రోహం కేసు పెట్టి శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర డిజిపిని కోరారు.