25.2 C
Hyderabad
May 16, 2024 19: 14 PM
Slider కరీంనగర్

హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

#BloodDonationCamp

లాక్ డౌన్ కారణంగా రక్తనిధి కేంద్రాలలో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. దాంతో ఇబ్బందిగా ఉన్న రోగులకు రక్తం అవసరం అయినప్పుడు పరిష్కారం దొరకడం లేదు.

ఈ కొరత కొంతైనా తీర్చేందుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి  గ్రామ సర్పంచ్  కాయిత రాములు శుక్రవారం రక్తాన్ని దానం చేశారు.

హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన సర్పంచ్ కాయిత రాములు ను సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్  రవి ప్రవీణ్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

ఎంతోమంది రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని విషయంపై స్పందించిన సర్పంచ్ రక్త ఇవ్వడం హర్షణీయమన్నారు.

Related posts

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS

పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్ప‌స్వామి

Satyam NEWS

తహసీల్దార్, యస్సైల పై కోర్టు ధిక్కరణ పిటీషన్

Bhavani

Leave a Comment