కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం- రాష్ట్ర జడ్పీటీసీ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నాగిరెడ్డిపెట్ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, లింగంపెట్ మండల జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో చేరారు.
స్థానిక ఎమ్మెల్యే సురేందర్ నియోజక వర్గ అభివృద్ధికి చేస్తున్న పనులు, సంక్షేమ పథకాల అమలు చేస్తున్న తీరునచ్చి, ఎమ్మెల్యే నాయకత్వంలో తమవంతు మండలాల అభివృద్ధికి కృషి చేసేందుకు గురువారం రాష్ట్ర రోడ్డు & భవనాల శాఖ మరియు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ , స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ల సమక్షంలో తెరాస పార్టీలో చేరారు.
మంత్రి తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు & అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నాగిరెడ్డిపెట్ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, లింగంపెట్ మండల జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి, ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ వీడి తెరాస పార్టీలో చేరారని సంతోషం వ్యక్తం చేసారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ డఫెదర్ శోభా రాజు, డఫెదర్ రాజు, ఎల్లారెడ్డి సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి , సత్యం రావు, పిఎసియస్ చైర్మన్లు, నర్సింలు, గంగారెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.