రిసార్ట్స్ పేరుతో డేంజర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇలాంటి ఒక డేంజర్ గేమ్ లో ఒక యువకుడు మరణించడం సంచలనం కలిగిస్తున్నది. గోధుమగూడ లో హైదరాబాద్ అడ్వాంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ ప్రోగ్రాం రిసార్ట్స్ లో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం వంద మందికి పైగా యవకులు రిసార్ట్స్ కి చేరుకున్నారు.
పారవేసిన వస్తువును తీసుకురావడమే గేమ్ టార్గెట్ గా ఒక దారుణమైన ఆటను ప్రారంభించారు. రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో దాన్ని తీసుకురావడానికి ఒక యువకుడు బావిలో దూకాడు. బావిలోకి దూకిన యుకుడి పేరు సాయి కుమార్. 34 ఏళ్ల సాయి కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. సాయికుమార్ కి ఇటీవలే బాబు పుట్టాడు.
అనుమతి లేకుండా హైదరాబాద్ అడ్వాంచర్ క్లబ్ నిర్వహిస్తున్న మూన్ లైట్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా వికారాబాద్ చుట్టూ పుట్టగొడుగుల్లా వెలిసిన రిసార్ట్స్ ఇలాంటి అక్రమ గేమ్స్ ఎన్నో ప్రతి రోజూ లేదా శలవు రోజుల్లో నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం సాయి కుమార్ మృతదేహాన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.