38.2 C
Hyderabad
April 29, 2024 13: 25 PM
Slider జాతీయం

కరోనా తల్లికి పుట్టిన నవజాత శిశువు మరణం

#infant

కరోనా మరణాలలో అత్యంత విషాదకరమైన మరణం ఇది.

కరోనా సోకిన ఒక గర్భవతి ప్రసవించింది. పండంటి బిడ్డ పుట్టిందని సంతోషించే లోపునే ఆ బిడ్డకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన కొన్ని గంటల్లోనే ఆ నవజాత శిశువు కళ్లు పూర్తిగా తెరవకుండానే మరణించింది.

హృదయ విదారకమైన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగింది.

కరోనా సోకిన గర్భవతి ఏప్రిల్ 1వ తేదీన ప్రసవించింది. నేడు ఆ శిశువు మరణించింది.

శిశువును కాపాడేందుకు రెమిడిస్వీర్ ఇంజక్షన్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని డైమండ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Related posts

ప్రముఖ తెలుగు సినీ నటి గీతాంజలి కన్నుమూత

Satyam NEWS

కోవిడ్ 19 ఎదుర్కొనడానికి సర్పంచ్ లు ముందుకు రావాలి

Satyam NEWS

గవర్నర్ పై హైకోర్టుకు ప్రభుత్వం

Murali Krishna

Leave a Comment