కరోనా మరణాలలో అత్యంత విషాదకరమైన మరణం ఇది.
కరోనా సోకిన ఒక గర్భవతి ప్రసవించింది. పండంటి బిడ్డ పుట్టిందని సంతోషించే లోపునే ఆ బిడ్డకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన కొన్ని గంటల్లోనే ఆ నవజాత శిశువు కళ్లు పూర్తిగా తెరవకుండానే మరణించింది.
హృదయ విదారకమైన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగింది.
కరోనా సోకిన గర్భవతి ఏప్రిల్ 1వ తేదీన ప్రసవించింది. నేడు ఆ శిశువు మరణించింది.
శిశువును కాపాడేందుకు రెమిడిస్వీర్ ఇంజక్షన్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని డైమండ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.