రెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదని పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే. రెప్పపాటు కాదు కదా మనిసి రెప్పలు మూత పడుతున్నా కరెంటు రావడం లేదు.
వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగడంతో ఒక కరోనా రోగి ప్రాణం పోయింది. ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డులో గాంధీ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.
ఇదే సమయంలో వార్డులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో గాంధీ మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.