29.7 C
Hyderabad
May 6, 2024 06: 13 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఇసుక కొరతపై గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష

33-Nara-Lokesh

ఏపీలో ఇసుక కొరతపై విపక్ష పార్టీలు ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్నారు. ఈ సాయంత్రం ఐదు గంటల వరకు లోకేష్ దీక్ష చేయనున్నారు. వైసీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడంవల్లే ఇసుక దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో అల్లాడుతున్నారని.. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఆకలి బాధలు లేవని చెబుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Related posts

ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ లాంచ్

Satyam NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి…

Satyam NEWS

Leave a Comment