గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.గ్రేటర్ వరంగల్ 65 డివిజన్ పరిధిలోని నిరుప్ నగర్ తండా లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గిరిజనుల పండుగలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.