చర్లపల్లి డివిజన్ పరిధిలోని మింట్ కాలనీలో సోమవారం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ జీహెచ్ఎంసీ మరియు ఎలక్ట్రికల్ ఆధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న కార్పోరేటర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలోని డ్రైనేజీ మరియు స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఉన్నాయని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కి తెలపడంతో వెంటనే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి బాల్ రెడ్డి,సత్తిరెడ్డి,రమేష్ గౌడ్,కుమార స్వామి గౌడ్, తిరుపాల్,గోపాలకృష్ణ,స్వామి,ధనుంజయ్ గౌడ్, కొమ్ము రమేష్,సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.