24.7 C
Hyderabad
May 16, 2024 23: 11 PM
Slider ముఖ్యంశాలు

అధికార పార్టీ నేతలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

#IT searches

అధికార పార్టీ నేతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్‌గా ఉన్నారు. ముగ్గురూ కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైళ్ళ శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు ఓపెన్ చేశారు. ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నాయి.

Related posts

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Satyam NEWS

విజయనగరం కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి పరిశీలించిన ఎస్పీ దీపిక

Satyam NEWS

ఎమ్మెల్యే ముందే ప్రభుత్వంపై సింగోటం రామన్న విమర్శలు

Satyam NEWS

Leave a Comment