మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెల కూల్చివేత ను నిరసిస్తూ సిపిఎం పార్టీ కార్యకర్తలు గార్లలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్థానిక నెహ్రూ సెంటర్ లో బైఠాయించడంతో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు వాహనాలకు అంతరాయం కలిగింది.
రాస్తారోకో నుద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమీపంలో గత కొన్ని నెలలుగా పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం గుడిసెల తొలగింపు నిలిపి నివాసముంటున్న వారందరికీ పట్టా హక్కు, డబుల్ బెడ్ రూం నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరి ప్రసాద్, కవిత,హరినాయక్, వెంకటేశ్వర్లు, సత్యవతి, రామకృష్ణ, శ్రీను, రామకృష్ణ, పవన్, బిక్షం, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.