38.2 C
Hyderabad
April 29, 2024 19: 12 PM
Slider వరంగల్

గార్లలో సిపిఎం కార్యకర్తల రాస్తారోకో

#CPI

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెల కూల్చివేత ను నిరసిస్తూ సిపిఎం పార్టీ కార్యకర్తలు గార్లలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్థానిక నెహ్రూ సెంటర్ లో బైఠాయించడంతో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు వాహనాలకు అంతరాయం కలిగింది.

రాస్తారోకో నుద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమీపంలో గత కొన్ని నెలలుగా పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం గుడిసెల తొలగింపు నిలిపి నివాసముంటున్న వారందరికీ పట్టా హక్కు, డబుల్ బెడ్ రూం నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరి ప్రసాద్, కవిత,హరినాయక్, వెంకటేశ్వర్లు, సత్యవతి, రామకృష్ణ, శ్రీను, రామకృష్ణ, పవన్, బిక్షం, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

Murali Krishna

మింగుతున్న చైనా… తప్పుకున్న అమెరికా…. మునుగుతున్న భారత్

Satyam NEWS

యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి

Satyam NEWS

Leave a Comment