ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సభ నిర్వహించారు. ఆ సంఘ నాయకుడు సింగోటం రమన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే ముందే ఆ సంఘ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విద్య వైద్యాన్ని ఏవిధంగా అందిస్తుందో ఆ సంఘ నాయకులు సింగోటం రామన్న వివరించారు.
ప్రభుత్వాని ఇండైరెక్ట్ గా విమర్శించారు. ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. మా ప్రజల ఓట్లు వేయించుకోవడం కాదు,విద్య వైద్యం అందించండి అంటూ ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ తాలూకాలో మెరుగైన విద్యను, వైద్యాన్ని అందించాలి అన్నారు. డబ్బులు కట్టి వైద్యం తీసుకునే, చదువుకునే పరిస్థితిలో మా ప్రజలు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యే అటు ఇటు చూస్తూ కనిపించాడు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదని తెలిసింది.