హైదరాబాద్ లోని కాచిగూడలో శ్యామ్ బాబా ఫాల్గుణి వేడుకలు శనివారం ఎంతో వైభవంగా జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలు పాల్గొని శ్యామ్ బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నేలపై పొర్లుకుంటూ మొక్కలు తీర్చుకున్నారు.
ఈ ఫాల్గుణి వేడుకల్లో బీజేపీ నాయకులు శిశు సంక్షేమ శాఖ సభ్యుడు బి. వెంకట్ రెడ్డి బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేష్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్యామ్ బాబా సేవ సమితి సభ్యులు వారిని సత్కరించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టి. అశోక్ టిబ్రైవాల్, ఇంద్రకరణ్, రాజ్ కుమార్ విగ్, రామ్ దేవ్, బిజెపి నాయకులు బి. సంతోష్, పంకజ్, రవియాదవ్, తదితరులు పాల్గొన్నారు.