40.2 C
Hyderabad
April 29, 2024 18: 27 PM
Slider కడప

అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ వైసీపీ డ్రామాలు

CPM Madu

పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కడప లో శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మీడియాతో మాట్లాడారు. యునైటెడ్ నేషన్స్ కూడా సిఏఏ ను వ్యతిరేకంగా మాట్లాడిందని, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడాము, అప్పుడు ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకారు.

అప్పట్లో స్వాతంత్ర్యం కోసం ముస్లిం లు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడారు. మొదట స్వాతంత్రం కోసం పోరాడింది ముస్లింలు. కమ్యూనిస్ట్ ల గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు పౌరసత్వ చట్టం అమలు చేయనివ్వం. ముస్లింలు సిఏఏ కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు. దీక్షలను ఎత్తేయాలని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చలో కడప కార్యక్రమం నిర్వహిస్తామని మధు తెలిపారు. బాబ్రీ మసీదును కూల్చి రామ మందిరాన్ని కడుతున్న బీజేపీ, 16 రాష్ట్రాల్లో ఎన్పిఆర్ ను అమలు చేయమని తీర్మానం చేశారు మరి దానికి ఏం సమాధానం చెబుతారని మధు ప్రశ్నించారు. బీజేపీ పాలన రౌడీ రాజ్యాంగ మారింది, మా పోరాటం బీజేపీ, ఆరెస్సెస్ మీదనే అని ఆయన స్పష్టం చేశారు.

Related posts

నిండుకుండలా మూసి నది

Bhavani

తెలంగాణ పోలీస్ కీర్తి పెంచేలా కృషి చేయండి

Satyam NEWS

మృతులకు నివాళులర్పించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

Satyam NEWS

Leave a Comment