ఒక కిరాతకుడి చేతిలో నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్లో శవపరీక్ష పూర్తయింది.
వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ వద్ద తెదేపా, వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు బైఠాయించి నిరసనకు దిగారు.
బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు.
రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.