కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ శోభన్, ఎస్ఐ సత్యనారాయణలను బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఎడ్ల సాయిలు తోపాటు ఎమ్మార్పీఎస్ దండోరా నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై సీఐలు మాట్లాడుతూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు వారికి సహకరించాలని ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి అభివృద్ధి చెందాలన్నారు. అన్నిటికీ మూలం చదువు కావున చదువు పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికీ చదువు పట్ల ఆసక్తి కలిగించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించి యువతను సరిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సీఐ లతో పాటు దండోర నాయకులు మాధవ్, వెండి గంగాధర్, లాలూ గుండె కల్లూరు, రాజులా గంగాధర్, కథగా౦ నాగేశ్వరరావు, దేవడా మాధు, మైత్రీ హనుమలు, సాయిలు, దిగంబర్, సురేష్ తదితరులున్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్