ఉత్తరాంద్రలో ప్రసిద్దిగాంచిన శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి దేవస్థానం రామతీర్దంలో వచ్చే నెల 22 వ శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారికి పట్టాభిషేకం,పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈఓ ప్రసాద్ తెలిపారు.
ఈ నెల అనగాష 23న పునర్వసు నక్షత్రం కాగా వచ్చే నెల 21న బుధవారం శ్రీరామ నవమి పడిందన్నారు. అదే రోజు గురువారం… శ్రీరామ స్వామి వారి పట్టాభిషేకం, యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం తో దీక్ష చేపట్టిన శ్రీ రామ భక్తుల పునర్వసు దీక్షలు ముగుస్తాయని..ఆలయ ప్రథాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు తెలిపారు..
దీక్షలో పాల్గొనే దీక్షాదారులు ముందుగా వచ్చి పేర్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. అ ద్వితీయ శ్రీరామ పునర్వసు దీక్షల్లో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గోని శ్రీరామ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.అంతేగాక రెండోసారి పునర్వసు దీక్ష చేపట్టన భక్తులందరూ..రాముని కృపకుపాత్రలు కాగలరని మీడియాకు తెలిపారు.