కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో అక్రమ ఇసుక డంప్ లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుకను తీసుకువచ్చి తమ అనువైన ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు
కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా గ్రామాన్ని సందర్శించి ఇసుక డంపులను పరిశీలించి సుమారు యాభై పైన ఇసుక డంపులను సీజ్ చేసినట్లు సత్యం న్యూస్ తో తెలిపారు.
ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే ఇసుక తోపాటు ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.