నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ సరస్వతీ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐ.జి ప్రభాకర్ రావ్ నేడు సందర్శించారు.
శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మనుమరాలు అనిక రావ్ కు అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఆలయ పూజారులు స్వాగతం పలికారు.
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా చేయించి ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ AEO సుదర్శన్ గౌడ్, ఆలయ ఇంచార్జ్ నారాయణ్ పటేల్, ముధోల్ సి.ఐ.అజయ్ బాబు, బాసర ఎస్ఐ. ప్రేమ్ దీప్ ఉన్నారు.