శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలోని ప్రకాశ్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు సీసీ కెమెరాలతో కూడిన వీడియో వాల్ పనితీరును పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బుధవారం పరిశీలించారు.
ఇప్పటికే నగరంలోని 200 సీసీ కెమెరాల విజువల్స్ ను బిగ్ స్క్రీన్లో విక్షీంచేవిధఁగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎల్సిడి ప్యానెల్లు, డైరెక్ట్ వ్యూ మల్టీ-మానిటర్ సెటప్ తో రూపొందించిన వీడియో వాల్ అందుబాటులో వున్న నేపథ్యంలో త్వరలో మరొక వీడియో వాల్ స్దాపించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వీడియో వాల్ , సీసీ కెమెరాలు ఏ సమయంలోనైనా సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తిన
త్వరితగతిన మరమ్మత్తులు చేయాలని సంబంధిత టెక్నికల్ టీమ్ మరియు పోలీస్ అధికారులకు సూచించారు.
రానున్న రోజుల్లో మరిన్ని అధునిక టెక్నాలజీ కలిగిన మల్టీ-మానిటర్ సెటప్ తో రూపొందించిన వీడియో వాల్ రానున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ స్నేహ మెహ్రా , ఏసీపీలు ప్రసన్న కుమార్ , రామోజీ రమేష్ , నాయక్, జహాంగీర్ , త్రీ టౌన్ సిఐ శ్రీధర్ పాల్గొన్నారు.