తెలంగాణ భూ భాగంపై పండిన యాపిల్ పండ్లు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరాయి. సాధారణంగా శీతల ప్రదేశాలలో పండే యాపిల్ పండ్లను తెలంగాణకు చెందిన రైతు తెలంగాణ భూమి పై పండించాడు. తొలి కాతను అతను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేశారు.
కొమరం బీమ్ జిల్లా కు చెందిన రైతు కేంద్రె బాలాజీ యాపిల్ పంట పండించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్ చేరుకున్న బాలాజీ తాను పండించిన యాపిల్ పండ్లను ముఖ్యమంత్రికి బహూకరించారు.