కిర్లంపూడి మండలం,గెద్దనాపల్లి గ్రామానికి చెందిన 48 సంవత్సరాల నిరుపేద దివ్యాంగురాలు గౌరి వెంకటరమణ మంగళవారం కలెక్టరేటుకు వచ్చి కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీతను కలిసి, కాళ్లు పనిచేయని కారణంగా, ఏ ఆధారం లేని తాను పడుతున్న కష్టాలను విన్నవించింది
ఏదో ఒక పని చేసుకుని, వృద్ధురాలైన తల్లిని పోషించుకుంటానని, అందుకు తనకు మూడు చక్రాల సైకిల్ ఇప్పించాలని అభ్యర్థించింది. ఆమె దీనస్థితికి చలించిన జిల్లా కలెక్టర్ ఉమా మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, కాకినాడ ద్వారా మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీకి సూచించారు.
ఈ మేరకు ఉమామనోవికాసం కేంద్రం ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ ఎస్.పి.రెడ్డి ఆమెకు మూడు చక్రాల సైకిల్ను అందజేశారు. తనకు ట్రైసైకిల్ ఇప్పించి జీవితంలో కొత్త వెలుగులు నింపిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు దివ్యాంగ మహిళ గౌరి వెంకట రమణ ఆనంద అశ్రు నయనాలతో ధన్యవాదాలు తెలియజేసింది.