ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
2014లో హుజూర్నగర్లో జగన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని ఆయనపై అభియోగం. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఏపీ సీఎం జగన్కు ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు.