కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నందున దేశ రాజధాని ఢిల్లీలో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నారు.
నేటి రాత్రి నుంచి 26వ తేదీ వరకూ రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.