శ్రీకాకుళం జిల్లా శివారు ప్రాంతమైన ఇచ్చాపురం, రత్తకన్న పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10.05 గంటల సమయంలో భూమి వరుసగా మూడు సార్లు కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. ఇదే వారంలో వరుసగా నాలుగు సార్లు భూమి కంపించడం, అధికారులకు సమాచారం ఇచ్చిన వారు సరైన రీతిలో స్పందించకపోవడంతో స్థానికుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాంతంలో భూప్రకంపనలు పట్ల పరిశోధన జరిపి కారణాలను విశ్లేషించాలని వారు కోరుతున్నారు.
previous post