నాగమణి రాయి ఉంది మీకు కావాలా? తీసుకోండి. కేవలం కోటి రూపాయలు మాత్రమే. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు జలజలా రాలతాయి. అంటూ మార్కెటింగ్ చేస్తూ ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్న నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు బృందం వలపని పట్టుకుంది.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో బి.దేవేందర్ ఎలియాస్ దేవా, టి.జాన్, ప్రేమ్ చంద్ గుప్త, మహ్మద్ అష్రాఫ్ లు ఉన్నారు. వీరు దుర్గామాత ప్రతిమను నాగమణి ని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కార్వాన్ ప్రాంతంలోని జియా గూడాలో వీరి నుంచి దుర్గామాత విగ్రహాన్ని నాగమణి ని స్వాధీనం చేసుకున్నారు. వారు ఉపయోగించిన మూడు సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.