తెలుగు వాళ్ళ ను విడగొట్టిన ఘనత కాంగ్రెస్ పొర్టీదేనని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యఃరో సభ్యులు ఆశోక్ గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లా లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటో పూలమాలలు వేసి అంజలి ఘటించి న అనంతరం మీడియా తో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్ర లకై స్వాతంత్ర్య కాలంలో అనేక పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు…. అశోక్ గజపతిరాజు. అలా పుట్టుకొచ్చిందే మన ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
కానీ దుష్ట కాంగ్రెస్… స్వొర్ధ బుధ్ధితో ఆ చింతనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను స్వలాభం కోసం విడగొట్టిందని అశోక్ గజపతిరాజు అన్నారు. కానీ నాటి మద్రాస్ నుంచీ తెలుగు వారినందరిని సంఘటిత పరచి ప్రత్యేక రాష్ట్ర సాధనకై తన ప్రాణాన్ని లెక్క చేయని మహనీయుడు పొట్టి శ్రీరాములు అని అశోక్ గజపతిరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, బొద్దెల నరసింగరావు వేమలి చైతన్య బాబు, కఃది మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.